Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు బండి సంజయ్

Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సిట్ ఎదుట హాజరు కానున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆయన పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తూ, ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. దీనితో ఆయన గురువారం హైదరాబాద్లో కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ భేటీలో తెలంగాణకు చెందిన మాజీ పోలీసు ఉన్నతాధికారులు, సిట్, కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగాల్లో పనిచేసిన అధికారులతో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అంశంపైనే చర్చ జరిపినట్లు సమాచారం.
గతప్రభుత్వ హయాంలో బండి సంజయ్ ఫోన్ల నేఅత్యధికంగా ట్యాప్ చేసినట్టు నిర్ధారించిన నిఘా వర్గాలు వాటికి సంబంధించిన ఆధారాలను సేకరించి ఆయన ముందు ఉంచాయి. ఫోన్ట్యాపింగ్లో సిట్ఎదుట హాజరవుతున్న తొలి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కావడం గమనార్హం.
మరో వైపు ఈ ఇష్యూను బీజేపీ జాతీయ స్థాయి అంశంగా పరిగణిస్తోంది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ జాతీయ నేత బీఎల్సంతోష్ఫోన్ను సైతం ట్యాప్చేశారని అనుమానిస్తున్నారు. ఈ కేసును సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
ఫోన్ ట్యాపింగ్కేసులో గత నెల 24న విచారణకు హాజరుకావాలని బండి సంజయ్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. పార్లమెంటుసమావేశాలు ఉన్న కారణంగా విచారణకు హాజరుకాలేనని బండి సంజయ్ సిట్కు సమాచారం అందించారు. ఈ క్రమంలో ముందస్తు అనుమతితో నేడు హాజరు కానున్నారు. బండి సంజయ్తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది సైతం విచారణకు హాజరుకానున్నారు. వాళ్ల ఫోన్లు సైతం కేసీఆర్ప్రభుత్వం ట్యాపింగ్చేసిందని గుర్తించారు.



