తెలంగాణ
Bandi Sanjay: సీఎంకు అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ పుష్కరాలపై లేదు

Bandi Sanjay: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరస్వతి పుష్కరాలకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయలేదన్నారు. సీఎంకు అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ పుష్కరాలపై లేదని మండిపడ్డారు. పుష్కరాల నిర్వహణకు రూ.35 కోట్లు ఏ మూలకు సరిపోతాయన్నారు. అందాల పోటీలకు మాత్రం 300 కోట్లు విడుదల చేశారని ధ్వజమెత్తారు.
పుష్కరాల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పుష్కరాలను కుంభమేళ తరహాలో నిర్వహిస్తామన్నారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కారాల స్నానం చేయడం చాలా సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.