తెలంగాణ

Bandi Sanjay: ఓ వ్యక్తి కోసం నిబంధనలు మారవు.. రాజాసింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్

Bandi Sanjay: రాజాసింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి బండిసంజయ్. రాజాసింగ్ హిందూ ధర్మం కోసం పోరాడే నాయకుడు అని అయితే ఏవైన అభ్యంతరాలు ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలని సూచనలు చేశారు. కొన్ని విషయాలను మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం సరికాదని హితవు పలికారు.

అధిష్టానం ఇచ్చిన సూచనలు, ఆదేశాల ప్రకారం రాష్ట్ర, జిల్లా, మండలం, బూత్ స్థాయి కమిటీలు నిర్ణయిస్తారని తెలిపారు. ఒక పద్ధతి, నియమ నిబంధనల ప్రకారం కమిటీలు వేస్తారని చెప్పారు. ఓ వ్యక్తి కోసం పార్టీ నిబంధనలు మార్చరని స్పష్టం చేశారు. కొంత మంది రాజాసింగ్‌ను రెచ్చగొట్టారని, ఆయనను రెచ్చగొట్టొద్దని సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button