టాలీవుడ్

NTR Death Anniversary: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

NTR Death Anniversary: సీనియర్ ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్లో నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళ్లు అర్పించారు. ఎన్టీఆర్ తెలుగుజాతి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారన్నారు బాలకృష్ణ.

తాతగారైన ఎన్టీఆర్ గారి ఆలోచనలు, స్ఫూర్తి తమ జీవితానికి మార్గదర్శకమని జూనియర్ ఎన్టీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. కళ్యాణ్ రామ్ కూడా ఎన్టీఆర్ వ్యక్తిత్వం, విలువలను ప్రస్తావిస్తూ ఆయన్ను ఎంతో మిస్సయ్యామన్నారు. కాసేపట్లో ఏపీ మంత్రి నారా లోకేశ్ సైతం ఘాట్ వద్దకు చేరుకొని తన నివాళిని అర్పించనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button