తెలంగాణ

కామారెడ్డి జిల్లా కేంద్రంలో శిశువు విక్రయం

కామారెడ్డి జిల్లా కేంద్రంలో శిశువు విక్రయం కలకలం రేగింది. కామారెడ్డి మండలం క్యాసంపల్లికి చెందిన.. దంపతులు రాజమణి-నరసింహులుకి మగబిడ్డ జన్మించాడు. అయితే.. ఈ నెల 19న మధ్యవర్తుల సమక్షంలో 55వేల రూపాయలకు శిశువును విక్రయించారు.

ఈ క్రమంలో డబ్బులు పంచుకునే విషయంలో మధ్యవర్తులు, బిడ్డను అమ్మిన వారికి మధ్య గొడవ తలె త్తింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు శిశువును బాలల పరిరక్షణాధికారులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button