అవతార్ 3: భారత్లో అట్టర్ ప్లాప్!

Avatar: Fire and Ash: జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన అవతార్: ఫైర్ అండ్ యాష్ భారత్లో అంచనాలకు తగ్గట్టు ఆకట్టుకోలేకపోయింది. భారీ బడ్జెట్తో విడుదలైన ఈ చిత్రం సామాన్య ప్రేక్షకులను మెప్పించలేదు. ధురంధర్ పోటీతో పాటు కథనంలోని లోపాలు కారణమని చర్చ జరుగుతోంది. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.
హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ రూపొందించిన అవతార్: ఫైర్ అండ్ యాష్ డిసెంబర్ 19న విడుదలైంది. భారత్లో రూ.450 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగినా సామాన్య ప్రేక్షకులను ఆకర్షించలేకపోయింది. ప్రధాన కారణంగా రణవీర్ సింగ్ ధురంధర్ పోటీని చూపిస్తున్నారు. ధురంధర్ థియేటర్లలో దూసుకుపోతూ మంచి కలెక్షన్లు సాధిస్తోంది.
టీమిండియా క్రికెటర్లు మొత్తం థియేటర్ బుక్ చేసుకొని చూసి ప్రశంసలు కురిపించారు. అవతార్ 3లో కథనం స్లోగా సాగడం, పాత కథనే అనిపించడం మరో మైనస్గా మారింది. మూడున్నర గంటల నిడివి ఉన్నా కథ ఆకట్టుకోలేకపోవడంతో ప్రేక్షకులకు విసుగు కలిగింది. హిందీతో పాటు సౌత్ చిత్రాల పోటీ కూడా ప్రభావం చూపింది. అవతార్ 4 కూడా వస్తుందనే వార్తలు ప్రేక్షకుల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా 100 కోట్లు కూడా దాటడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



