తెలంగాణ
కాళేశ్వరం ప్రాజెక్టు సెక్యూరిటీ గార్డుపై దాడి

కాళేశ్వరం ప్రాజెక్టు సెక్యూరిటీ గార్డుపై దాడి జరిగింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ గేటు తెరవాలంటూ సెక్యూరిటీ గార్డు రవీందర్తో కొందరు గొడవ పెట్టుకున్నారు. అయితే ప్రాజెక్టు గేటు తెరిచేందుకు సెక్యూరిటీ గార్డు రవీందర్ ససేమిరా అన్నారు.
దీంతో సెక్యూరిటీ గార్డుపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఘటన లో సెక్యూరిటీ గార్డు రవీందర్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.