జాతియం
Asaduddin Owais: పహల్గాంలో జరిగిన దాడి దురదృష్టకరం

Asaduddin Owaisi: పహల్గాం ఉగ్రదాడి ఘటనపై ఎంపీ అసదుద్దీన్ స్పందించారు. పర్యాటకులపై జరిగిన దాడి దురదృష్టకరమన్నారు ఆయన. ఇది సెంట్రల్ ఇంటెలిజన్స్ ఫెయిల్యూర్ అన్న ఓవైసీ బాధితులకు MIM అండగా ఉంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
ఎవరైతే పాకిస్తాన్ బార్డర్ దాటి లోపలికి వచ్చారో వారిని కేంద్ర ప్రభుత్వం ఊరికే వదిలిపెట్టదని ఎంపీ అసదుద్దీన్ తేల్చిచెప్పారు. గతంలో పుల్వామాలో జరిగిన ఘటన కంటే ఇది చాలా పెద్ద దాడని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రత ఏర్పాటు చేయాలన్నారు అసదుద్దీన్.