తెలంగాణ
Arvind Dharmapuri: ఉత్తమ్కు జీరో నాలెడ్జ్

Arvind Dharmapuri: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైరయ్యారు. కాంగ్రెస్తో ఏదీ అవ్వదని ప్రజలకు అర్ధమైందని ఎంపీ అరవింద్ అన్నారు. ఉత్తమ్కుమార్ ఏదో ప్రోగ్రామ్ పెట్టుకొని డైవర్ట్ పాలిటిక్స్కు తెరదీశారని అన్నారు. ఉత్తమ్కు జీరో నాలెడ్జ్ అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఉత్తమ్ సగం బీఆర్ఎస్, సగం కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు.
బనకచర్ల ప్రాజెక్ట్కు జగన్ సీఎంగా ఉన్నప్పుడే కేసీఆర్ ఆమోదం తెలిపారని అన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ను చంద్రబాబు ప్రారంభించారని అన్నారు. తెలంగాణకు ఎన్ని టీఎంసీల నీళ్లు అవసరం ఉంది. నిధులు ఎలా అంటే ఉత్తమ్ నుంచి సమాధానం లేదన్నారు. లోకల్ బాడీ ఎన్నికల కోసమే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.