తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మహిళా ఆర్చరీ ఛాంపియన్

Archery Champion: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు మహిళా ఆర్చరీ ఛాంపియన్ చికిత తనిపర్తి. కెనడాలో జరిగిన 2025 యూత్ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో భారత్ తరపున బంగారు పతకం గెలుచుకున్న తొలి మహిళగా చికిత రికార్డు సృష్టించారు. చైనాలోని షాంగైలో జరిగిన సీనియర్ వరల్డ్ కప్ పోటీల్లో రజతపతకం సాధించిన చికితను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.
ఒలంపిక్స్ లో పతకం సాధించేలా ప్రభుత్వం తరపున పూర్తి శిక్షణ అందించేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు , శాట్స్ ఛైర్మన్ శివసేనారెడ్డి , రాజేందర్ రావు తోపాటు పలువురు పాల్గొన్నారు.



