YS Sharmila: పార్లమెంటు ముందుకు వక్ఫ్ బిల్లు రావడం అంటే ఇవాళ బ్లాక్ డే

Sharmila: వక్ఫ్ సవరణ బిల్లుపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ట్వీట్ చేశారు. కేంద్రం తీరుపై ఆమె నిప్పులు చెరిగారు. ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను హరించడానికే వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెడుతున్నట్లు విమర్శించారు. ముస్లిం మనోభావాలు దెబ్బతీయడమే మోదీ అజెండా అంటూ మండిపడ్డారు షర్మిల. ఇక పార్లమెంటు ముందుకు వక్ఫ్ బిల్లు రావడం అంటే ఇవాళ బ్లాక్ డే అని అభివర్ణించారు వైఎస్ షర్మిల.
వక్ఫ్ బిల్లుతో మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప బీజేపీకి మరొకటి లేదని షర్మిల ఆరోపించారు. వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేసేందుకే ఈ పన్నాగమన్నారు ఆమె. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా 20కోట్ల మంది ముస్లింలు ఆందోళన చేస్తున్నారని ట్వీట్లో పేర్కొన్నారు. 300ఏళ్ల క్రితం నాటి ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు అడగడం ఏంటి..? అంటూ ప్రశ్నించారు. మైనార్టీల ప్రయోజనాలను దెబ్బతీసే బిల్లుకు టీడీపీ-జనసేనలు మద్దతు పలకడం దారుణమన్నారు వైఎస్ షర్మిల.