ఆంధ్ర ప్రదేశ్
AP Assembly: 28న అసెంబ్లీలో ఏపీ బడ్జెట్

AP Assembly: ఈ నెల 28న ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. మార్చి 21 వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మా ర్చి 19 నాటికి బడ్జెట్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.
మార్చి 20, 21 తేదీలను షెడ్యూల్లో పెట్టగా మార్చి 20, 21 తేదీలను రిజర్వ్ డేలుగా ఉంచారు. ఇక అవసరమైతే మరో రెండ్రోజులపాటు పొడిగించే అవకాశం కన్పిస్తోంది. మొత్తానికి వారానికి ఐదు రోజులు అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.