ఆంధ్ర ప్రదేశ్
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు

Vallabhaneni vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు అయింది. గన్నవరంలో అక్రమ మైనింగ్కు పాల్పడ్డారని కేసు నమోదు చేశారు పోలీసులు. 58పేజీలతో వంశీపై మైనింగ్ ఏడీ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
బినామీ పేరిట 150కోట్లు దోచుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. క్రైమ్ నెంబర్ 142/2025తో గన్నవరం పీఎస్లో వంశీపై కేసు నమోదు కాగా కోర్టులో పిటీ వారెంట్ దాఖలు చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.