ఆంధ్ర ప్రదేశ్
Anitha: జగన్.. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్థుడు

Anitha: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీరుపై హోంమంత్రి వంగలపూడి అనిత నిప్పులు చెరిగారు. జగన్ రెంటపాళ్ల పర్యటనపై ధ్వజమెత్తారు. జగన్.. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్థుడంటూ మండిపడ్డారు. పరామర్శ పేరుతో వెళ్లి రోడ్షో నిర్వహించడమేంటని నిలదీశారు.
ఇద్దరు వ్యక్తులు చనిపోయినా జగన్ తన పర్యటన కొనసాగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక జగన్కు రాజకీయ లబ్ధి తప్పించి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? అంటూ క్వశ్చన్ చేశారు.