AP News: ఏపీలో 55 మంది ప్రభుత్వ వైద్యుల తొలగింపు

AP News: ఏపీలో 55 మంది ప్రభుత్వ వైద్యులను విధుల నుంచి తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం. లోకాయుక్త ఆదేశాలతో విధులకు డుమ్మా కొట్టిన వైద్యులను విధుల నుంచి టెర్మినేట్ చేసింది. చర్యలు తీసుకున్నట్టు లోకాయుక్తకు నివేదిక పంపించింది ఏపీ వైద్యారోగ్యశాఖ. తొలగింపునకు గురైన వైద్యుల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు.
కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వ వైద్యుల వ్యవహారశైలిపై లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతి, సెలవు లేకుండా ఏడాదికి పైగా వైద్యులు గైర్హాజరవుతున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వైద్యులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని లోకాయుక్తకు తన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారాన్ని లోకాయుక్త సీరియస్గా తీసుకుంది. ఎలాంటి అనుమతి లేకుండా సెలవు కూడా పెట్టకుండా సుదీర్ఘకాలం పాటు విధులకు హాజరుకాని ఆ వైద్యులను తొలగించాలని స్పష్టం చేసింది. ఇక లోకాయుక్త ఆదేశాలతో 55 మంది వైద్యుల టెర్మినేట్ చేసింది ఏపీ సర్కార్.