ఆంధ్ర ప్రదేశ్

Anagani Satya Prasad: గత ప్రభుత్వం రీ సర్వేను భ్రష్టు పట్టించింది

Anagani Satya Prasad: రాష్ట్రంలో రీ సర్వే ప్రతిష్టాత్మకంగా సాగుతోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ సర్వేలో పాల్గొంటున్న ఉద్యోగులు, అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు. పొలం గట్లపై తిరుగుతూ ఉద్యోగులు సర్వే చేస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. రైతుల, భూ యజమానుల హక్కులను రక్షించే విధంగా పొలం గట్లపైన తిరుగుతూ సర్వే ఉద్యోగులు కష్టపడుతున్నారన్నారు.

గత ప్రభుత్వం రీ సర్వేను భ్రష్టు పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం రీ సర్వేను తప్పుల తడకగా నిర్వహించిందన్నారు. మా ప్రభుత్వం ఆ తప్పులను సరి చేస్తుందన్నారు. రీ సర్వేను ఎంతో పకడ్బందీగా చేస్తున్నామన్నారు. అందులో సర్వే శాఖ ఉద్యోగులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలియజేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button