సినిమా
ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పృహ తప్పి పడిపోయిన డైరెక్టర్ అమ్మ రాజశేఖర్

Amma Rajasekhar: ప్రముఖ దర్శకుడు అమ్మ రాజశేఖర్ ‘తల’ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో స్రృహ తప్పి పడిపోయారు. ఉన్నట్లుండి ఒక్కసారిగా పడిపోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. అమ్మ రాజశేఖర్ ఏమయ్యిందని సినీ వర్గాల్లో ఆందోళన మొదలయ్యింది.
అమ్మ రాజశేఖర్ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘తల’. ఈ చిత్రంలో ఆయన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా నటించాడు. రీసెంట్గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేతుల మీదుగా విడుదలైన ఈ మూవీ.. తమిళ్, తెలుగు ట్రైలర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. చూసిన వాళ్లంతా సూపర్బ్ అని మెచ్చుకుంటున్నారు. తాజాగా ఆయన స్పృహ తప్పి పడిపోవడంతో టీమ్ ఆందోళనకు గురయ్యింది.