జాతియం
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై అమిత్ షా ట్వీట్.. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సల్స్ రహితంగా దేశం

Amit Shah: ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై హోం మంత్రి అమిత్ షా ఆనందం వ్యక్తం చేశారు. భారత సైనికులు ‘నక్సల్ ముక్త్ భారత్ అభియాన్’ దిశలో మరో పెద్ద విజయాన్ని సాధించారని పొగిడారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నక్సల్స్ రహితంగా మారబోతోందంటూ పోస్ట్ పెట్టారు. కాగా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, కాంకేర్లలో మన భద్రతా దళాలు నిర్వహించిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో 22 మంది నక్సలైట్లు హతమయ్యారు.
మోడీ ప్రభుత్వం నక్సలైట్లపై కఠినమైన విధానంతో ముందుకు సాగుతోంది. లొంగిపోని నక్సలైట్లపై జీరో-టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోంది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నక్సల్ రహితంగా ఉంటుందని అమిత్ షా అన్నారు.