ఆంధ్ర ప్రదేశ్
అమరావతిలో రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన

Amit Shah: అమరావతిలో రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. అమిత్ షా పర్యటన ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్ఐడీఎం కేంద్రం, ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ప్రాంగణాలను అమిత్ షా ప్రారంభించనున్నారు.