జాతియం

మన దేశంపై అమెరికా పెత్తనం ఎన్నాళ్లు..?

ఇది ఒక కీలక సమయం. ఇండియా ఇప్పుడేం చేస్తుంది? ఎలా చేస్తుంది? ఎలా వ్యవహరిస్తుందన్నది ఎంతో ముఖ్యం. సందర్భం వచ్చినప్పుడు ఎవరి రంగు ఎలాంటిదో తేలుతుంది. అప్పటివరకు అందరూ మనవాళ్లే. అందరూ మనతోనే ఉంటారు. సహజంగా మనం ఇలాగే భావిస్తాం. కానీ అమెరికా విషయంలో ఇప్పుడు జరుగుతోందేందన్నదానిపై ఫుల్ క్లారిటీ వస్తోంది. బయటకు ఒకలా, లోపల మరోలా నిన్నటి వరకు మోడీ మై ఫ్రండ్ ఇప్పుడు కాదా అంటే అవుననే అంటున్నారు.

కానీ పాకిస్తాన్‌పై కూడా లోలోపల ఉన్న ప్రేమ బయటకు తీసి చూపిస్తున్నారు. తేడా సుస్పష్టం. ఓవరాల్‌గా ఇప్పుడు మనకో పిక్చర్ క్లియర్ అవుతోంది. అమెరికా మిత్రుడు రూపంలో ఉన్న దుష్మన్ అని అర్థమవుతోంది. ఒయటకు మిత్రుడిలా కన్పిస్తూ, లోపల మాత్రం వళ్లంతా విషం కక్కుతోంది అగ్రరాజ్యం.

అమెరికా తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా ఇండియాకు ప్రతికూలమే. ఎందులోనైనా గానీ తనకు లాభం చూసుకుంటోంది అగ్రరాజ్యం. గతంలో ఇండియాతో చెలిమి అంటూ కాకమ్మ కబుర్లు చెప్పిన అమెరికా కేవలం ఆయుధాలను అమ్ముకోవడానికి, ఇండియా నుంచి బెనిఫిట్ పొందడానికి మాత్రమే ప్రయత్నించిందన్నది స్పష్టమవుతోంది. ఇండియాతో సఖ్యత చూపించడం వెనుక అమెరికా బిజినెస్ బ్రెయిన్ ఉంది. అంతేకానీ ఇండియాపై అమెరికాకు ఎప్పటికీ ప్రేమ లేదని తాజాగా రుజువవుతోంది.

ఒక్క మాటలో చెప్పాలంటే డోనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్- ఇండియాను కలిపి ఉచ్చరించడం నీచాతి నీచమని చెప్పాలి. ఆ దేశం దుర్బుద్ధిని ట్రంప్ భారతీయులకు మరోసారి రుచి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అమెరికా అంటే వంచన, అమెరికా అంటే దగా అన్నది మరోసారి రుజువయ్యింది. వాస్తవానికి పాకిస్తాన్‌ను పెంచి పోషిస్తోంది అమెరికానని వేరే చెప్పాలా ఈ విషయాన్ని ఆలస్యంగానైనా భారతీయులు గుర్తిస్తే మంచిది.

మనం విలువలు, వలువలు అంటూ చెప్పుకుంటూ పోతే అంతిమంగా నష్టపోతామని కూడా తాజాగా రుజువైంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఎంతగానో వేదన చెందారు. పాకిస్తాన్ చేస్తున్నకుట్రలను ప్రపంచానికి ఏకరు పెట్టారు. ఓవైపు దౌత్యం మరోవైపు యుద్ధనీతి రెంటి ద్వారానే పాకిస్తాన్‌ను కంట్రోల్‌లో పెట్టగలమని మనకు దశాబ్దాల అనుభవం ఉండనే ఉంది.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దాడులకు ప్రతిగా స్పందించకుంటే భారతదేశం చేతగాని దేశంగా చరిత్రలో నిలిచిపోయేది. గతంలో పుల్వామా ఎటాక్ జరిగినప్పుడు ఇండియా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో సర్జికల్ స్ట్రైక్ ద్వారా అటాక్ చేసింది. తాజాగా పహల్గామ్ దాడి తర్వాత ఇండియా దూకుడు మరింత పెంచింది. ఇండియా ఎవరిపైనా దాడి చేయదు.

ఎవరైనా ఇండియాను టార్గెట్ చేస్తూ చూస్తూ ఊరుకోదన్న సందేశాన్ని స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇండియా చేసి చూపించింది. నాటి కాంగ్రెస్ పాలకులు, నేటి పాలకులకు కూడా ఇదే సిద్ధాంతం వర్తిస్తుంది.

ఇండియా అంటే చేతకాని దేశం, చేవలేని దేశం కాదురా అన్న భావనను పూర్తిస్థాయిలో పాకిస్తాన్‌కు చూపించింది. పాకిస్తాన్ అసలు స్వరూపం ప్రపంచానికి స్పష్టం చేసింది. పాక్ అకృత్యాలను ప్రపంచానికి చూపించాలని ఇండియా ఎంతగా ప్రయత్నించినా, అమెరికా మాత్రం అమెరికా కళ్లకు గంతలు కట్టుకుంటోంది.

తనకేమీ కనబడటం లేదని మీకూ ఏమీ కనబడటం లేదు కదా అంటూ ప్రపంచదేశాలను తన చెప్పు చేతల్లో ఉంచుకుంటుంది. ప్రపంచం అంతా అమెరికా మాయలో ఉంది. ఇప్పుడు ఇండియా ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది.

ఓవైపు అమెరికాను కార్నర్ చేస్తూనే పాకిస్థాన్‌ను పీచమణచాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు యుద్ధం చేయడంతోపాటు యుద్ధ సంసద్ధత ద్వారా పాకిస్తాన్‌ చెంమడాలు వలచాలి. పాకిస్తాన్‌కు సపోర్ట్ చేసే వాళ్లను ఎదుర్కొనేలా ఇండియా దౌత్య నీతి ఉండాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button