Allu Arvind: కిమ్స్ ఆస్పత్రికి అల్లు అరవింద్.. సంధ్య థియేటర్ ఘటనలో బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా

Allu Arvind: తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే 39 ఏళ్ల మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమారుడు 9 ఏళ్ల శ్రీతేజ్ ఆస్పత్రి పాలయ్యాడు. గత రెండు వారాలుగా శ్రీతేజ్కు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స జరుగుతున్నా.. పరిస్థితి మెరుగుపడలేదు. ఇక ఇదే కేసులో ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత కోర్టు, జైలు.. ఇలా అనేక పరిణామాలు జరగడం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకునేందుకు సినిమా ప్రొడ్యూసర్, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్.. ఆస్పత్రికి వెళ్లారు.
ఈ సందర్భంగా సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను అల్లు అరవింద్ పరామర్శించారు. అక్కడే ఉన్న బాలుడి కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. అదే సమయంలో ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలను కిమ్స్ హాస్పిటల్ డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్లోని సంధ్య థియేటర్ వద్ద.. డిసెంబర్ 4వ తేదీ రాత్రి జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ గత 2 వారాలుగా కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇక శ్రీతేజ్ ఆరోగ్యం గురించి.. కిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు మంగళవారం రాత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం విషమంగానే ఉందని.. ఐసీయూలో వెంటిలేటర్పైనే ఉన్నాడని కిమ్స్ డాక్టర్లు చేతన్, విష్ణు తేజ్లు ఆ హెల్త్ బులిటెన్లో పేర్కొన్నారు. శ్రీతేజ్ మెదడుకు ఆక్సిజన్ సరిగా అందడం లేదని.. అతడ్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ట్యూబ్ ద్వారా శ్రీతేజ్కు ఆహారం అందిస్తున్నామని వెల్లడించారు.
ఈ సందర్భంగా పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరమని పేర్కొన్న అల్లు అరవింద్.. రేవతి కుటుంబానికి తాము అండగా ఉండి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తమకు సహకరించిందని చెప్పారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్ ఆస్పత్రికి రాలేకపోయారని..