సినిమా

Allu Arjun: అల్లు అర్జున్‌కు బెయిల్‌ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

Allu Arjun: సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ కి భారీ ఊరట ల‌భించింది. అల్లు అర్జున్‌కు నాంప‌ల్లి కోర్టు రెగ్యుల‌ర్ బెయిల్‌ను మంజూరు చేసింది. పుష్ప-2 బెనిఫిట్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన విష‌యం తెలిసిందే.

రేవ‌తి మ‌రణానికి అల్లు అర్జున్‌ కారణమంటూ ఆయ‌న‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో ఆయన విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్‌ ముగియడంతో రెగ్యులర్‌ బెయిల్‌ కోసం అల్లు అర్జున్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. నేడు విచార‌ణ చేప‌ట్టిన‌ నాంప‌ల్లి కోర్టు అల్లు అర్జున్‌కి రూ. 50 వేలు, అలాగే రెండు పూచికత్తులపై ఈ బెయిల్ మంజూరు చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button