టాలీవుడ్

Allu Aravind: శ్రీతేజ్‌ కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం..

Allu Aravind: ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద డిసెంబర్‌ 4న రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్‌కు గాయాలవగా.. ప్రస్తుతం శ్రీతేజ్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.. కాగా ఇవాళ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌ రాజు, నిర్మాత అల్లు అరవింద్‌ తో కలిసి కిమ్స్‌ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించారు.

ఈ సందర్భంగా రేవతి కుటుంబానికి పుష్ప టీం రూ.2 కోట్లు పరిహారం ప్రకటించింది. అల్లు అర్జున్‌ రూ.కోటి, సుకుమార్‌ రూ.50 లక్షలు, మైత్రీ మూవీ మేకర్స్‌ రూ.50 లక్షలు ప్రకటించగా.. పరిహారం చెక్కులను అల్లు అరవింద్‌ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్ రాజుకు అందజేశారు. ఈ మేరకు అల్లు అరవింద్‌, దిల్ రాజు కలిసి శ్రీతేజ్‌ కుటుంబసభ్యులకు చెక్కు అందజేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button