జాతియం

Shubhanshu Shuklas: 40 ఏళ్ల తర్వాత అంతరిక్షంలోకి భారతీయుడు

Shubhanshu Shuklas: భారత అంతరిక్ష ప్రయాణం మరో మైలురాయిని దాటనుంది. గత పాతికేళ్లలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు 270 మందికి పైగా వ్యోమగాములు వెళ్లారు. కానీ వారిలో భారతీయులు ఒక్కరు కూడా లేరు. ఆ ఘనత శుభాంశు శుక్లా సాధించబోతున్నారు. ఆనాటి సోవియెట్ యూనియన్ సహకారంతో 1984లో సోయూజ్ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు రాకేశ్ శర్మ. ఆ తర్వాత కల్పనా చావ్లా, సునీత విలియమ్స్‌ అంతరిక్షంలోకి వెళ్లినా, వారు భారతీయ సంతతివారే తప్ప, భారత్‌లో పుట్టి పెరిగినవారు కాదు.

కానీ, ఇప్పుడు నాలుగు దశాబ్దాల తర్వాత ఈ ఘనత సాధించనున్న రెండో వ్యక్తిగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళుతున్న తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా నిలవనున్నారు. ఆక్సియం 4 మిషన్‌లో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా భారత కాలమానం ప్రకారం రేపు సాయంత్రం 5గంటల 52 నిమిషాలకు ఫ్లోరిడాలోని నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లబోతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button