ఆంధ్ర ప్రదేశ్
ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం

Alapati Rajendra Prasad: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపొందారు. ఇది పట్టభద్రుల విజయంగా భావిస్తున్నామని ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు.
తన విజయానికి కృషి చేసిన నాయకులకు, పట్టభద్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విద్యా విధానాన్ని వైసీపీ సర్వ నాశనం చేసిందని ఆయన విమర్శించారు. శాసనమండలిలో విద్య సమస్యలపై గళం విప్పుతానని ఆయన అన్నారు.