జాతియం
Air Sirens: చండీఘడ్లో మోగిన ఎయిర్ సైరన్

Air sirens: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చండీగఢ్లో సైరన్లు మోగాయి. దాడులు జరగవచ్చని ఎయిర్ఫోర్స్ హెచ్చరించింది. అంతేకాదు స్థానికులు ఇళ్లలోనే ఉండాలని కనీసం బాల్కనీల్లోకి కూడా రావొద్దని సూచించింది. ఇక జమ్ములోనూ ఉదయం సైరన్లు మోగాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోనూ హైఅలర్ట్ ప్రకటించింది.
ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల్ని రద్దు చేసింది. ఇక ఇండియాగేట్ ప్రాంతం వద్ద ట్రఫిక్ నియంత్రణ కొనసాగుతోంది. త్వరలోనే ఇండియాగేట్ పరిసరాలను ఖాళీ చేయాలని భద్రతా బలగాలు స్థానిక ప్రజలు, పర్యాటకులకు సూచనలు జారీ చేసింది.