అంతర్జాతీయం
Myanmar Earthquake: మయన్మార్లో కొనసాగుతున్న సహాయక చర్యలు

Myanmar Earthquake: మయన్మార్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం కారణంగా ఇప్పటివరకు 205 మంది మృతి చెందారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. అటు మయన్మార్లోని ఆరు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీని విధించారు అధికారులు.
ఆర్మీ బలగాలు సైతం సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. థాయ్లాండ్లోనూ భారీ భూకంపం రావడంతో అక్కడి జనం నిరాశ్రయిలయ్యారు. దీంతో భారత్ వారికి ఆపన్నహస్తం అందించింది. కష్టకాలంలో మయన్మార్కు అండగా నిలుస్తోంది భారత్.