తెలంగాణ
Mallikarjun Kharge: జూలై 4న తెలంగాణకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే

Mallikarjun Kharge: వచ్చేనెల 4న తెలంగాణకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వస్తున్నారు. ఇందులో భాగంగా అదే రోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం భేటీ కానుంది. అనంతరం ఎక్స్టెండెడ్ కోర్ కమిటీ భేటీకి ఖర్గే హాజరుకానున్నారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ నిర్వహించనున్న సభలో ఖర్గే పాల్గొంటారు. ఈ సభలో గ్రామ కార్యదర్శి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొననున్నారు. దాదాపు 17వేల మందితో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.