అవికా గోర్ పెళ్లి.. ఓ సంచలనం!

Avika Gor: బుల్లితెర స్టార్ అవికా గోర్ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. వ్యాపారవేత్త మిలింద్ చాంద్వానీతో ఈ నెల 30న పెళ్లి చేసుకుంటున్నారు. ఈ వివాహం రియాలిటీ షోలో ప్రసారం కానుంది. చరిత్రలో తొలిసారి ఇలాంటి ఘట్టం జరగనుంది. పూర్తి వివరాలు చూద్దాం.
వాయిస్ ఓవర్: చిన్నారి పెళ్ళికూతురు సీరియల్తో బుల్లితెరపై గుర్తింపు పొందిన అవికా గోర్, ఇప్పుడు నిజ జీవితంలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఐదేళ్లుగా మిలింద్ చాంద్వానీతో డేటింగ్లో ఉన్న ఈ 28 ఏళ్ల నటి, జూన్లో నిశ్చితార్థం చేసుకున్నారు. సెప్టెంబర్ 30న జరిగే వివాహాన్ని తాను హోస్ట్ చేస్తున్న ‘పతి పత్ని ఔర్ పంగా’ రియాలిటీ షోలో లైవ్ ప్రసారం చేయనున్నారు.
ఇలాంటి ఘట్టం బుల్లితెర చరిత్రలో ఇదే తొలిసారి. తెలుగులో ‘ఉయ్యాల జంపాల’తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అవికా, పలు సినిమాలతో ఆకట్టుకున్నారు. నిర్మాతగా కూడా స్క్రీన్ క్రియేషన్స్ సంస్థను స్థాపించారు. పెళ్లి తర్వాత నటన కొనసాగిస్తారా అన్నది ఆసక్తికరం. అభిమానులు ఈ లైవ్ వివాహాన్ని చూసేందుకు ఉత్సాహంగా ఉన్నారు.



