తెలంగాణ
Hyderabad: హైదరాబాద్లో దారుణం.. అకౌంటెంట్పై యాసిడ్ దాడి

Hyderabad: హైదరాబాద్ సైదాబాద్లోని ఓ వ్యక్తిపై యాసిడ్ దాడి జరిగిన ఘటన కలకలం రేపుతోంది. గోపి అనే వ్యక్తిపై దుండగులు యాసిడ్ దాడి చేశారు. ఘటనలో గోపికి తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం భూలక్ష్మమ్మ ఆలయంలో అకౌంటెంట్గా పని చేస్తున్నాడు గోపి. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.