తెలంగాణ
కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీసులు

KTR: మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ-కారు రేసు కేసులో నోటీసులు అందించింది. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ క్రమంలో ఏసీబీ తనకు నోటీసులు జారీ చేసిన విషయాన్ని కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ఫార్ములా ఈ కేసులో ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని ఏసీబీ తనకు నోటీసు ఇచ్చిందన్నారు కేటీఆర్. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కేసు పూర్తిగా రాజకీయ వేధింపు అయినప్పటికీ, ఖచ్చితంగా ఏజెన్సీలతో సహకరిస్తానన్నారు.