తెలంగాణ
సిరిసిల్ల జిల్లాలోని శ్రీ చైతన్య స్కూల్ వద్ద ఏబీవీపీ కార్యకర్తల ఆందోళన

సిరిసిల్ల జిల్లాలోని శ్రీ చైతన్య స్కూల్ వద్ద ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నిబంధనలకు విరుద్ధంగా శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం బుక్స్ విక్రయిస్తున్నారు. స్కూల్లో అమ్ముతున్న బుక్స్ను ఏబీవీపీ నాయకులు పట్టుకున్నారు.
MEO రఘుపతిని సస్పెండ్ చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీ చైతన్య స్కూల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బుక్స్ విక్రయిస్తున్నారని ఏబీవీపీ కార్యకర్తలు మండిపడ్డారు.