News
ఏపీలో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ వైద్య సేవలు

AP: ఏపీలో ఆరోగ్యశ్రీ అనారోగ్యం బారిన పడింది. అవును రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. పెండింగ్లోని 3వేల 500కోట్ల బకాయిలు చెల్లించాలని నెట్ వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవోకు నెట్వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యాలు నోటీసులు అందించా యి. ప్రస్తుతం 600 ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. ఇక ఓపీ సేవలు కూడా నిలిపివేసినట్లు నెట్వర్స్ హాస్పిటల్స్ యాజమాన్యం ప్రకటించాయి.