తెలంగాణ
తెలంగాణ లోక్ భవన్లో గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారి సమక్షంలో అక్షయ విద్య ఫౌండేషన్ విద్యార్థులకు ల్యాప్టాప్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి గస్ట్ గా హాజరైన పటాన్చెరు, శ్రీ సాయి గణేష్ కాలనీకి చెందిన వే టూ ఎక్స్పెర్ట్స్ ఫౌండర్ కొడాలి సునీల్ గారు, అక్షయ విద్య ఫౌండేషన్ చేసే సేవా కార్యక్రమాలను చూసి ప్రశంసిస్తూ, గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారి చేతుల మీదుగా ఫౌండేషన్కు రూ.1 లక్షల చెక్ను అందజేశారు. ఈ సహకారం విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.




