ఆంధ్ర ప్రదేశ్

Eluru: పిల్లి పిల్లలను చూసి.. పులి పిల్లలని భావించి భయాందోళనకు గురైన స్థానికులు

Eluru: ఆగిరిపల్లి మండలం కృష్టవరం గ్రామ సమీపంలో నాలుగు పిల్లి పిల్లలను చూసి పులి పిల్లలని ప్రచారం జరగటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. గతంలో ఆగిరిపల్లి, గన్నవరం మండలాల్లో పందుల కోసం వేసిన ఉచ్చులో చిక్కి ఓ పులి మృతి చెందింది.

అయితే చనిపోయిన ఆ పులి పిల్లలు ఇక్కడ తిరుగుతున్నాయని దానిపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో స్థానికులు హడలిపోయారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పిల్లలను పరిశీలించారు. అవి పిల్లి పిల్లలు అని తెలవటంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button