తెలంగాణ
ఎస్పీ ఎదుట లొంగిపోయిన 8 మంది మావోయిస్టులు

ములుగు జిల్లాలో నిషేధిత మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ములుగు జిల్లా ఎస్పీ శబరిష్ ఎదుట వివిధ దళాల్లో పనిచేస్తున్న ఎనిమిది మంది నక్సల్స్ లొంగిపోయారు. ఇప్పటి వరకు తెలంగాణలో 355 మంది మావోయిస్టులు లొంగిపోయారని ములుగు ఎస్పీ శబరీస్ వెల్లడించారు. లొంగిపోయిన మావోస్టులకు తక్షణ సాయం కింద రూ.25వేలు అందించారు.