అస్సాం వరదల్లో 34 మంది మృతి

గత మూడు రోజులుగా ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మణిపూర్, త్రిపుర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో కనీసం 34 మంది మృతి చెందారు. వరద సహాయక చర్యల కోసం వైమానిక దళం, అస్సాం రైఫిల్స్ను పిలిపించారు.
ఉత్తర సిక్కింలో 1,200 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు. ఆదివారం మళ్లీ కొండచరియలు విరిగిపడ్డాయి. మే 29న మున్షితాంగ్ వద్ద తీస్తా నదిలో వాహనం పడిపోవడంతో 8 మంది పర్యాటకులు గల్లంతయ్యారు. వారి జాడ ఇంకా తెలియలేదు. మేఘాలయలో 10 జిల్లాలు ఆకస్మిక వరదలు , కొండచరియలు విరిగిపడటంతో ప్రభావితమయ్యాయి. త్రిపురలో 10,000 మందికి పైగా ప్రజలు ఆకస్మిక వరదల బారిన పడ్డారు.
అస్సాంలో, 19 జిల్లాల్లోని 764 గ్రామాలు ఆకస్మిక వరదలకు గురయ్యాయి, దీని వలన 3.6 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. అస్సాంలో వరదలు, కొండచరియలు విరిగిపడిన మృతి చెందినవారి సంఖ్య మరింతపెరిగింది. దిబ్రూగఢ్, నీమతిఘాట్, ఇతర ప్రాంతాలలో బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. మరో ఐదు నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. 10,000 మందికి పైగా ప్రజలను సహాయ శిబిరాలకు తరలించారు.
వరద బాధిత ప్రాంతాలకు సాధ్యమైన అన్ని విధాలుగా సహాయం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ఆయన అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులతో, మణిపూర్ గవర్నర్తో మాట్లాడారు. అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ, మణిపూర్ గవర్నర్తోనూ మాట్లాడానన్నారు అమిత్ షా. ఏదైనా పరిస్థితిని ఎదుర్కోవడానికి వారికి సాధ్యమైనంత సహాయం చేస్తామని హామీ ఇచ్చాను.