కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కలకలం.. 15 మంది అస్వస్థత

కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపింది. కల్తీ కల్లు తాగి జనం అస్వస్థతకు గురయ్యారు. గాంధారి మండలంలోని గౌరారం గ్రామంలో కుస్తీ పోటీల సందర్భంగా కల్తీ కల్లు తాగి 30మంది అస్వస్థతకు గురి కాగా ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో వరుసగా కల్తీ కల్లు ఘటనలు చోటు చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. కాసుల కక్కుర్తితో కల్తీ కల్లు అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కల్లు దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు.
కల్తీ కల్లు బాధితులను సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు పరామర్శించారు. కల్తీ కల్లు విక్రయించిన వారిని పట్టుకోవడం కోసం మూడు బృందాలు గాలిస్తున్నారని సుపరింటెండెంట్ హనుమంతరావు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తామన్నారు.