ఆంధ్ర ప్రదేశ్
మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ముగ్గురు మావోయిస్టు నేతలు మృతి చెందారు. ఎన్కౌంటర్లో జోనల్ కమిటీ సభ్యులు.. ఉదయ్, అరుణ, అంజు మృతి చెందినట్లు తెలుస్తుంది. ఈ ఎన్ కౌంటర్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కన్పిస్తోంది.
ప్రస్తుతం కొయ్యలగూడెం సమీపంలోని అటవీ ప్రాంతంలో బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఘటనా స్థలంలో మూడు ఏకే 47 రైఫిల్స్ను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.