ఆంధ్ర ప్రదేశ్
AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో నిందితులు అరెస్ట్

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. లిక్కర్ కేసులో ధనుంజయ్రెడ్డి ఏ31 నిందితుడిగా, కృష్ణమోహన్రెడ్డి ఏ32 నిందితుడిగా ఉన్నారు. ఇదే కేసులో వీరికి ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సుప్రీం తీర్పుతో సిట్ అధికారులు మాజీ ఐఏఎస్ అధికారి, జగన్ మాజీ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, మాజీ సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డిని అరెస్ట్ చేశారు.
ఇప్పటికే ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్కి వైద్య పరీక్షలు పూర్తి కావడంతో సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్ రిమాండ్ రిపోర్ట్లో సిట్ కీలక అంశాలు వెల్లడించింది. కేసీరెడ్డితో కలిసి లిక్కర్ స్కాంకు పాల్పడ్డారు. లిక్కర్ స్కామ్ సిండికేట్లతో ఇద్దరు కీలక సభ్యులు ఉన్నారని సిట్ తెలిపింది.