జాతియం
Uttarakhand: అలకనందా నదిలో పడిన బస్సు.. 11 మంది గల్లంతు

Uttarakhand: ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అలకనంద నదిలో పర్యాటకుల బస్సు పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది గల్లంతయ్యారు. రుద్రప్రయాగ్లోని గోల్తీర్ ప్రాంతం లో ఈ ఘటన చోటుచేసుకుంది. బద్రీనాథ్ నుంచి వెళ్తున్న పర్యాటకుల బస్సు నదిలో పడిపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఏడుగురికి గాయాలయ్యాయి. ఇంకా, 10 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో నది పొంగిపొర్లుతుంది. దీంతో సహాయక చర్యల కు ఆటంకం కలుగుతుంది. ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ఉన్నట్లు సమాచారం.