టాలీవుడ్

మహేష్-రాజమౌళి సినిమా గురించి క్రేజీ న్యూస్.. రిలీజ్ అప్పుడే అంటూ చర్చలు

టాలీవుడ్‌ జక్కన్న బాహుబలి, ఆర్ఆర్‌ఆర్‌ సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచారు. ఇండియన్ సినిమా స్టామినాను అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పిన రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల అయ్యి దాదాపు మూడు ఏళ్లు కావస్తుంది. ఎట్టకేలకు ఆయన తన తదుపరి సినిమాకి క్లాప్ కొట్టబోతున్నారు. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మహేష్‌ బాబుతో రాజమౌళి రూపొందించబోతున్న సినిమా పూజా కార్యక్రమాలు 2025 జనవరిలో జరగబోతున్నాయి. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి.

రాజమౌళి ఈ సినిమాను రెండు భాగాలుగా చేయబోతున్నారట. బాహుబలిని రెండు పార్ట్‌లుగా విడుదల చేసిన రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కథ పెద్దది అయినా ఒకే పార్ట్‌లో తీసుకు వచ్చారు. కానీ మహేష్‌ బాబుతో తీయబోతున్న సినిమాను మాత్రం రెండు పార్ట్‌లుగా విడుదల చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. రెండు పార్ట్‌ల షూటింగ్ వేరు వేరుగా చేయనున్నారు. 2025 సమ్మర్‌ నుంచి మొదటి పార్ట్‌ రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించి సినిమాను 2027లో విడుదల చేయనున్నారు. సినిమా మరీ ఆలస్యం కాకుండా రాజమౌళి మొదటి నుంచి జాగ్రత్తలు తీసుకోనున్నారు.


మొదటి పార్ట్‌ విడుదల అయిన వెంటనే రెండో పార్ట్‌ మొదలు పెట్టబోతున్నారు. రెండో పార్ట్‌ను 2029లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారు. రాజమౌళి ఏం చేసినా పక్కా ప్లాన్‌తో చేస్తారు. ప్రతీది ముందస్తుగా ప్లాన్‌ చేసుకుంటారు. అందులో భాగంగానే మహేష్ బాబుతో చేయబోతున్న సినిమాను రెండు పార్ట్‌లుగా చేయడం మొదలుకుని 2027లో మొదటి పార్ట్‌, 2029లో రెండో పార్ట్‌ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట.

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబో సినిమా రెండు పార్ట్‌లు కలిపి దాదాపుగా అయిదు సంవత్సరాల సమయం తీసుకోనుంది. అంటే మహేష్ బాబు కెరీర్‌లో అయిదు ఏళ్లు పూర్తిగా రాజమౌళికి కేటాయించాల్సి ఉంటుంది. గతంలో రాజమౌళితో సినిమాలు చేసిన హీరోలు మరే సినిమాల్లో నటించలేదు. మరి మహేష్ బాబు సైతం అలాగే రాజమౌళి సినిమా కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తారా అనేది చూడాలి. బాహుబలి కోసం ప్రభాస్ దాదాపుగా అయిదు సంవత్సరాల సమయాన్ని ఇచ్చారు. కానీ మహేష్ బాబు ఫ్యాన్స్‌ మాత్రం రాజమౌళి సినిమా కోసం మహేష్ ఇన్నేళ్లు వెయిట్ చేయాలా అంటూ డీలా పడిపోతున్నారు.

మరోవైపు సోషల్ మీడియాలో SSMB 29 న్యూస్ కంటే రాజమౌళి డ్యాన్స్ వీడియోలే ఎక్కువ కనిపిస్తున్నాయంటూ మహేష్ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఇటీవల రాజమౌళి డ్యాన్స్ ఇరగదీస్తున్న సంగతి తెలిసిందే.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button